రెండు లారీలు ఢీ..ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-03-05T13:17:42+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైనేరు వంతెనపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైనేరు వంతెనపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు.