పంచాయతీ.. పరిషత్‌..

ABN , First Publish Date - 2021-04-11T05:16:30+05:30 IST

పలు వురు నాయకులు పంచా యతీలో ఉన్నారు.. పరిషత్‌లోనూ ఉన్నారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షి ంచుకుంటున్నారు.

పంచాయతీ.. పరిషత్‌..

రెండు ఎన్నికల్లోనూ ఒకే అభ్యర్థులు

ఉండి/ఆకివీడు రూరల్‌, ఏప్రిల్‌ 10 : పలు వురు నాయకులు పంచా యతీలో ఉన్నారు.. పరిషత్‌లోనూ ఉన్నారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షి ంచుకుంటున్నారు. వీరిలో కొందరు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధి ంచినా పరిషత్‌ను వీడలేదు. బరిలో దిగారు.. పోటీకి నిలబడ్డారు.  ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉండి మండలం వెలివర్రు జనసేన అనుకూల అభ్యర్థిగా రంగంలోకి దిగిన దుర్గారావు ప్రత్యర్థులైన వైసీపీ,టీడీపీ అభ్యర్థులను ఖంగుతినిపించారు. 500 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీటీసీగా కూడా బరిలో దిగి ప్రస్తుతం ఫలితానికి ఎదురు చూస్తున్నారు. ఆకివీడు మండలం అయిభీమవరం గ్రామంలో టీడీపీ అను కూల సర్పంచ్‌ అభ్యర్థినిగా పోటీ చేసి ఓడిపోయిన మహిళ మళ్లీ పరిషత్‌ బరిలోకి దిగింది. సానుభూతి తనకు కలిసివస్తుందని.. విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-04-11T05:16:30+05:30 IST