జైన్‌ దేవాలయాన్ని సందర్శించిన సాద్వినులు

ABN , First Publish Date - 2021-01-27T04:39:32+05:30 IST

పెదఅమిరం ఆదినాథ్‌ శ్వేతాంబర్‌ జైన్‌ తీర్ధ్‌ ఆల యాన్ని జైన మత ప్రచార సాద్వినిలు మంగళవారం సందర్శించారు.

జైన్‌ దేవాలయాన్ని సందర్శించిన సాద్వినులు

కాళ్ళ, జనవరి 26 : పెదఅమిరం ఆదినాథ్‌ శ్వేతాంబర్‌ జైన్‌ తీర్ధ్‌ ఆల యాన్ని జైన మత ప్రచార సాద్వినిలు మంగళవారం సందర్శించారు. ఆలయ కార్యదర్శి వినోద్‌కుమార్‌ జైన్‌, రాజేష్‌ జైన్‌ మాట్లాడుతూ కఠోర నియమ నిబంధనలతో జైన్‌ మత సన్యాసం ఆచరిస్తూ, ఏడాదిలో 8నెలల పాటు పాదయాత్రగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహావీర్‌ సిద్దాంతం ప్రచారం చేస్తు న్నారని, నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష పూర్తి చేశారన్నారు. మోక్ష రసశ్రీజీ, మోక్ష మాలశ్రీ, శిష్య బృందం ఆధ్వర్యంలో ఆదినాథ్‌ భగవంతుని 108 మహమస్తకాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T04:39:32+05:30 IST