నేటి నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
ABN , First Publish Date - 2021-01-14T05:06:58+05:30 IST
జాతీయ స్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలకు రుస్తుంబాద స్టేడియం సిద్ధమైంది.
నరసాపురం, జనవరి 13 : జాతీయ స్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలకు రుస్తుంబాద స్టేడియం సిద్ధమైంది. పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారా యుడు, డీఎస్పీ వీరాంజనే యరెడ్డి గురువారం ప్రారం భించనున్నారు. గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలు 18వ తేదీ వరకు జరగను న్నాయి.ఈ ఏడాది పైజ్మనీని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. సింథటిక్ మ్యాట్పై పోటీలు జరగనున్నాయి. పోటీలు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నిర్వాహకులు విచ్చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ర్టాల క్రీడాకారులు తరలివస్తున్నారు.