విషాదం.. అదృశ్యమైన ఐదేళ్ల బాలిక మృతి
ABN , First Publish Date - 2021-01-14T05:10:29+05:30 IST
అత్తిలిలో 8 రోజుల కిందట అదృశ్య మైన బాలిక సంఘటన విషాదంగా ముగిసింది.
అత్తిలి, జనవరి 13 : అత్తిలిలో 8 రోజుల కిందట అదృశ్య మైన బాలిక సంఘటన విషాదంగా ముగిసింది. గోగులమ్మపేటకు చెందిన పంపన కావ్యశ్రీ ఈ నెల 5న ఇంటి వద్ద ఆడు కుంటూ కనిపించకుండాపోయింది.బాలిక అదృశ్యంపై ఈ నెల 7వ తేదీన తండ్రి వర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి బాలిక కావ్యశ్రీ ఆచూకీకి వెతుకున్నారు. కొమ్మర పాలూరు చానల్లో బుధవారం కావ్యశ్రీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాజ్కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామా చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.