ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 21న తణుకులో పర్యటించనున్నారు. సంపూర్ణ గృహ హక్కు పథకం తణుకు నుండి సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం అమలు చేయనున్నారు. బహిరంగ సభను తణుకు చిట్టూరి ఇంద్రయ్య కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, మంత్రి రంగ రాజు, ఎమ్మెల్యే కారుమూరి పరిశీలించారు.