పేదలందరికీ సంక్షేమ ఫలాలు
ABN , First Publish Date - 2021-07-30T04:55:53+05:30 IST
రాష్ట్రంలో ప్రతీ పేదవాడికీ సంక్షేమ ఫలాలు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాల రాజు అన్నారు.
- ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
- లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ
వంగూరు జులై 29: రాష్ట్రంలో ప్రతీ పేదవాడికీ సంక్షేమ ఫలాలు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాల రాజు అన్నారు. గురువారం మండలపరిధిలో తి ప్పారెడ్డిపల్లి గేటు సమీపంలోని వీహెచ్ఆర్ ఫంక్ష న్ మాల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రేషన్ కార్డుల ను, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అ ర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్కార్డులు పంపిణీ చేస్తా మన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్ రాజునాయక్, నరేందర్రావు, వెంకటేశ్వర్ రావు, హమీద్, సురెందర్రెడ్డి, ఎల్లాగౌ డ్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలి
అచ్చంపేట అర్బన్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు ఐదు మొక్కలు నాటి పెంచాలని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల రాజు అన్నారు. గురువారం అచ్చంపేట మండలం చెంచుఫల్గుతండా పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొ క్కలు నాటారు. అంతకుముందు నాలుగు నెలల క్రితం అడవి శాఖ సిబ్బంది దాడిలో గాయపడిన 19మంది గిరిజనులకు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన ఒక్కొక్కరికి రూ.50 వేలు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గ్రామానికి సీసీ రోడ్డు వేయిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ శాంతాబాయి, జ డ్పీటీసీ మంత్ర్యానాయక్, మునిసిపల్ చైర్మన్ న ర్సింహాగౌడ్, రంగాపూర్ సర్పంచ్ లోక్యనాయక్, నాయకులు రాజేశ్వర్రెడ్డి, సీఎం రెడ్డి ఉన్నారు.