అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN , First Publish Date - 2021-07-31T06:03:49+05:30 IST
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
రాయికల్, జూలై 30: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మండలంలోని 587మందికి రేషన్కార్డులు పంపిణీ చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పతకం దేశానికే దిక్సూచి అని కొనియాడారు. అర్హులైన లబ్దిదారులందరికీ కార్డుల పంపి ణీ పూర్తి చేసి వారికి ఆగస్టు మొదటివారంలో సరుకులు పంపిణీ చే స్తామని అన్నారు. అంతకముందు మండలంలోని మహితాపూర్, ఇటి క్యాల గ్రామాలలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి వద్ద ప్రత్యే క పూజలు చేశారు. అనంతరం లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖ ర్గౌడ్, ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, మార్కె ట్ కమిటీ చైర్మన్ గన్నెరాజరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, సర్పంచులు అజారుద్ధీన్, లావణ్య, కౌన్సి లర్లు పాలొన్నారు.
రాయికల్ మండలానికి చెందిన 37మంది లబ్దిదారులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఫబీజేపీ పార్టీ మహిళావిభాగం జిల్లా నాయకురాలు తోకల లత, తోకల రవీంధర్లతో పాటు 50మంది టీఆర్ఎస్ పార్టీలోచేరగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఫమండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామంలో మదర్ ప్రతిభ ఫౌండే షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుశిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రారంభించారు. సర్పంచ్ రవి, కోఆర్డినేటర్ కావ్య పాల్గొన్నారు.