లబ్ధిదారులను మారిస్తే కోర్టుని ఆశ్రయిస్తాం
ABN , First Publish Date - 2020-07-12T11:23:55+05:30 IST
గత ప్రొసీడింగ్లు కాదని, టీడ్కో లబ్ధిదారులను మారిస్తే ఉన్నతన్యాయస్థానం ఆశ్రయిస్తామని ప్రభుత్వ మాజీ విప్ కూన రవి కుమార్
ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్
జగ్గుశాస్త్రులపేటలోని టిడ్కో ఇళ్ల వద్ద నిరసన
ఆమదాలవలస, జూలై 11: గత ప్రొసీడింగ్లు కాదని, టీడ్కో లబ్ధిదారులను మారిస్తే ఉన్నతన్యాయస్థానం ఆశ్రయిస్తామని ప్రభుత్వ మాజీ విప్ కూన రవి కుమార్ తెలిపారు. శనివారం లబ్ధిదారులతో కలిసి జగ్గుశాస్త్రులపేట వద్ద నిర్మించిన 527 టిడ్కో ఇళ్ల వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదా రుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. లబ్ధిదారులకు మేలు చేయవలసిన మునిసిపల్ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి కమిషనర్ అర్హులను గుర్తించి, వారి అభిప్రాయం ప్రకారం 300, 365,430 అడుగుల ఇళ్లు కేటాయించి ప్రొసీడింగ్ పత్రాలు అందించా మన్నారు. ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని తెలిపారు. లబ్ధిదారులు కమిషనర్ ఖాతాకే డీడీలు జమచేశారని గుర్తుచేశారు. ఏడాదిలో ప్రభుత్వం ఒక్కఇళ్లు ఇవ్వ లేదని, పైసా బిల్లు కూడా చెల్లించ లేదని తెలిపారు. కార్యక్రమంతో టీడీపీ నాయకులు ఎం.రమేష్, తమ్మినేని గీత, బోర గోవిందరావు, టి.విద్యాసాగర్, ఎస్.మురళి పాల్గొన్నారు.