ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST

సచివాలయ సిబ్బం ది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగై న సేవలు అందించాలని సచివాలయ సిబ్బందిని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ఉద్యోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

సచివాలయం తనిఖీ చేసిన

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), మే18: సచివాలయ సిబ్బం ది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగై న సేవలు అందించాలని  సచివాలయ సిబ్బందిని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీ పంలోని 14వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ సిబ్బంది హాజ రుపట్టి, ఉద్యోగుల మూమెంట్‌ రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌, ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదికలను పరిశీలిం చారు. సచివాలయ ఉద్యోగులంతా సక్రమంగా విధులు నిర్వహించి సిబ్బందికి కేటాయించిన లక్ష్యా లు గడువులోపల పూర్తి చేయాలన్నారు. ఓటీఎస్‌కు సంబంధించి డిజిటల్‌ ఫైన్‌ పెండింగ్‌ లేకుండా క్లియర్‌ చేయాలని వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీకి సూచించారు.

ఇంటి పన్ను, వాటర్‌ టాక్స్‌, ఓటీఎస్‌ డిజిటల్‌ అక్నాలెడ్జ్మెంట్‌లు పెండింగ్‌ లేకుండా చూ డాలన్నారు. వెల్ఫేర్‌ సెక్రటరీలు విద్యాదీవెన, జగన న్న చేదోడు, జగనన్న తోడు వంటి పథకాల అక్నా లెడ్జ్మెంట్‌లు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా రాయచోటి మున్సిపాలిటీలో ఇం టింటా సేకరించిన డ్రైవేస్టు, వెట్‌ వేస్ట్‌ మెటీరియల్‌ సపరేట్‌ చేసి డ్రైవేస్ట్‌ వేసేందుకు షెడ్డు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌  కమిషనర్‌కు సూచించారు. ప్రభు త్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ప్రజలందరికీ పూర్తి అవగాహన కల్పించాల ని సచివాలయ సిబ్బందికి తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST