పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2020-04-08T09:56:22+05:30 IST

యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మండల సహకార సంఘం చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొనుగోలు

పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

కీసర: యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మండల సహకార సంఘం చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో ముందస్తు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాదేశాల మేరకు మండల పరిధిలోని కీసర, భోగారం, చీర్యాల్‌, కరీంగూడ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు, వైస్‌ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-08T09:56:22+05:30 IST