గ్రామాల్లో తిరుగలేకపోతున్నాం, నిఽధులివ్వండి

ABN , First Publish Date - 2022-08-20T05:14:27+05:30 IST

గ్రామాల్లో తిరగలేకపోతున్నాం, నిధులు మంజూరు చేయాలని మండల ఎంపీటీసీలు మంత్రి హరీశ్‌రావును కోరారు.

గ్రామాల్లో తిరుగలేకపోతున్నాం, నిఽధులివ్వండి

  మంత్రి హరీశ్‌రావును కోరిన ఎంపీటీసీలు


వర్గల్‌, ఆగస్టు 19: గ్రామాల్లో తిరగలేకపోతున్నాం, నిధులు మంజూరు చేయాలని మండల ఎంపీటీసీలు మంత్రి హరీశ్‌రావును కోరారు. వర్గల్‌ ఎంపీపీ జాలిగామ లతరమేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ కడపల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో కలిసి తమ గోడును వెల్లబోసుకుని, వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నికల సందర్భంగా తమ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు నివేదిస్తే నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఎంపీటీసీలు వెంకటేశ్‌గౌడ్‌, జనార్ధన్‌ తదితరులు ఉన్నారు. కాగా మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దేవగనిక నాగరాజు జన్మదినం సందర్భంగా మంత్రి హరీశ్‌రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 


Updated Date - 2022-08-20T05:14:27+05:30 IST