20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2020-09-27T10:16:03+05:30 IST

ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

విజయపురిసౌత్‌, సెప్టెంబరు 26: ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో  నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం నాటికి సాగర్‌ నీటిమట్టం 589.80(311.44 టీఎంసీలు) అడుగులు ఉంది. కుడికాలువ ద్వారా 8,604 క్యూసెక్కులు, 20 క్రస్ట్‌గేట్లలో 14 గేట్లను 5 అడుగులు, 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,02,944, ఎస్‌ఎల్‌బీసీ 1,800, ఎడమ కాలువ ద్వారా 3,849, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28,582, వరద కాలువ ద్వారా 300, మొత్తం 2,46,079 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,66,829 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.40 అడుగులు(212.43 టీఎంసీలు) ఉంది.   

Updated Date - 2020-09-27T10:16:03+05:30 IST