శ్రీవారికి గోదామాలలు
ABN , First Publish Date - 2021-01-16T05:18:23+05:30 IST
శ్రీవారికి మహాభక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు గోదామాలలు అలంకరించారు.
తిరుమల, జనవరి15 (ఆంధ్రజ్యోతి): శ్రీవారికి మహాభక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు గోదామాలలు అలంకరించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ గోదాదేవి చెంత నుంచి ఈ మాలలను తిరుమల పెద్దజీయర్ మఠానికి శుక్రవారం ఉదయం తీసుకొచ్చారు. మఠం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఈ మాలలను పెద్దజీయర్ శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం మూలమూర్తికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద, చిన్న జీయర్స్వాములు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.