ప్రగతిపథంలో వాల్తేరు డివిజన్‌: డీఆర్‌ఎం

ABN , First Publish Date - 2022-08-16T06:20:46+05:30 IST

తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకలకు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ ముఖ్య అతిఽథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు.

ప్రగతిపథంలో వాల్తేరు డివిజన్‌: డీఆర్‌ఎం
ప్రసంగిస్తున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ

విశాఖపట్నం, ఆగస్టు 15: తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకలకు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ ముఖ్య అతిఽథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ ఏడాది జూలై నాటికి      రూ.2749.20 కోట్ల ఆదాయాన్ని వాల్తేరు డివిజన్‌ సమకూర్చి గత ఏడాదికన్నా సుమారు రూ.120 కోట్ల ఆదాయాభివృద్ధి సాధించిదని వివరించారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రదర్శించిన మోటారు బైక్‌ విన్యాసాలు, డాగ్‌ షో ఆకట్టుకున్నాయి. ఏడీఆర్‌ఎంలు సుధీర్‌కుమార్‌ గుప్తా, మనోజ్‌కుమార్‌ సాహు, తూర్పుకోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పారిజాత శెత్పతీ, సీనియర్‌ డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌ సీహెచ్‌.రఘువీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:20:46+05:30 IST