మహనీయుల అడుగు జాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2022-05-23T06:02:33+05:30 IST

మహనీయుల అడుగు జాడల్లో నడిచి వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని బుద్ధవనం ఓ ఎస్‌డీ మల్లేపల్లి లక్ష్మయ్య, హైకోర్టు న్యాయమూర్తి మహ్మద్‌సాదిక్‌ అలీ అన్నారు.

మహనీయుల అడుగు జాడల్లో నడవాలి
మాట్లాడుతున్న బుద్ధవనం ఓఎస్‌డీ మల్లేపల్లి లక్ష్మయ్య

- బుద్ధవనం ఓఎస్‌డీ మల్లేపల్లి లక్ష్మయ్య, హైకోర్టు న్యాయమూర్తి మహ్మద్‌సాదిక్‌ అలీ

కళ్యాణ్‌నగర్‌, మే 22: మహనీయుల అడుగు జాడల్లో నడిచి వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని బుద్ధవనం ఓ ఎస్‌డీ మల్లేపల్లి లక్ష్మయ్య, హైకోర్టు న్యాయమూర్తి మహ్మద్‌సాదిక్‌ అలీ అన్నారు. ఆది వారం గోదావరిఖని భాస్కర్‌ భవన్‌లో నిర్వహించిన ఆల్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ సొ సైటీ ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మిక ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. సమసమాజ స్థాపనకు యువత ముందుండాలని, ఉద్యోగులంతా ఏకతాటిపై నడవాలని, ఏ సమస్య వచ్చినా ఉద్యోగులంతా కలిసికట్టుగా ఉండాలని పి లుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి జెడ్‌పీటీసీ సంధ్యారాణి, లక్ష్మణ్‌, వెంకటస్వామి, శంకరయ్య, సాంబయ్య, వేముల జ్యోతి, మాదాసు రామమూర్తి, పులి మో హన్‌, మైస రాజేశం, ఎరుకల పోచం, బడికెల కృష్ణ,రత్నయ్య, తాళ్లపల్లి శంకర్‌, గడ్డం నారాయణ, మోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:02:33+05:30 IST