సంస్థానం హైస్కూల్‌ రిటైర్డ్‌ టీచర్‌ మృతి

ABN , First Publish Date - 2020-10-02T09:33:56+05:30 IST

పట్టణ పరిధి గొల్లపల్లి గ్రామానికి చెందిన సంస్థానం హైస్కూల్‌ రిటైర్డ్‌ టీచరు తెర్లి అప్పారావు (72) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సంస్థానం హైస్కూల్‌ రిటైర్డ్‌ టీచర్‌ మృతి

బొబ్బిలి: పట్టణ పరిధి గొల్లపల్లి గ్రామానికి చెందిన సంస్థానం హైస్కూల్‌ రిటైర్డ్‌ టీచరు తెర్లి అప్పారావు (72) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు.  విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్థానిక సంస్థానం హైస్కూలులో గణితం టీచరుగా పనిచేసి 2008లో  ఆయన ఉద్యోగ విరమణ చేశారు.  తెర్లి స్కూల్‌, ఐటీఐ తదితర  విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఆయనకు భార్య, కుమారులు శాంతికుమార్‌, కిరణ్‌కుమార్‌ ఉన్నారు. అప్పారావు మృతికి టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి బేబీనాయన, ప్రైవేట్‌ విద్యాసంస్థల అధినేతలు ఎంకే నాయుడు (నాని) , గౌరీ శంకరరావు, గోవిందనాయుడు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-02T09:33:56+05:30 IST