సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ కృషి
ABN , First Publish Date - 2020-10-02T09:33:22+05:30 IST
జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంల సమస్యలను ఏపీటీఎఫ్ వేదిక ద్వారా పరిష్కరిస్తామని జిల్లా గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు తెలి పారు.
దాసన్నపేట: జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంల సమస్యలను ఏపీటీఎఫ్ వేదిక ద్వారా పరిష్కరిస్తామని జిల్లా గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు తెలి పారు. కోట జంక్షన్ సమీపంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలో కొంతమంది హెచ్ఎంలపై వివిధ రకాల ఆరోపణలు మానవ హక్కుల వేదిక దృష్టికి వచ్చిందన్నారు.
లిఖితపూర్వకంగా జిల్లా విద్యాశాఖకు తెలియజేసినట్లు తెలిపారు. ఫ్యాప్టో ఐక్యతకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో మానవహక్కుల వేదిక తన చర్యలను తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. అయితే ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా లీకు చేయడం మానవ హక్కుల వేదికను కించపరి చినట్టుగా ఉందన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.