ఇసుక ట్రాక్టర్ పట్టివేత
ABN , First Publish Date - 2020-10-01T11:29:41+05:30 IST
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్, రెండు నాటు బండ్లును బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి యజమానులపైన కేసు నమోదు చేశారు.
శృంగవరపుకోట, సెప్టెంబరు 30 : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్, రెండు నాటు బండ్లును బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి యజమానులపైన కేసు నమోదు చేశారు. సీతారాంపురం గ్రామానికి చెందిన చప్ప సన్యాసినాయుడు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్తో ఇసుక తరలిస్తుండగా గోపాలపల్లి గ్రామం వద్ద పట్టుకున్నట్టు ఎస్ఐ జనార్దన్ చెప్పారు. వేములాపల్లికు చెందిన వర్రి సన్యాసినాయుడు, లగుడు అప్పలనాయుడు నాటు బళ్లుపై ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా మరో ఎస్ఐ జి.రాజేష్ అదుపులోకి తీసుకున్నారు.