బాలిక కిడ్నాప్ పై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-10-01T11:26:41+05:30 IST
బాలిక కిడ్నాప్పై కేసు నమోదు చేసినట్టు సీఐ జి.గోవిందరావు కేసు నమోదు చేశారు
కొత్తవలస, సెప్టెంబరు 30 : బాలిక కిడ్నాప్పై కేసు నమోదు చేసినట్టు సీఐ జి.గోవిందరావు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలొని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అక్కడే పని చేస్తున విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం, ఎస్డీ పాలెం గ్రామానికి చెందిన యడ్ల ప్రకాష్ అనే యువకుడు ఈ నెల 26న మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినట్టు ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.