చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2020-10-01T11:25:48+05:30 IST

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి చెందినట్టు ఏఎస్‌ఐ సీహెచ్‌ శంకరరావు బుధవారం తెలిపారు.

చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి

బొండపల్లి, సెప్టెంబరు 30 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి చెందినట్టు ఏఎస్‌ఐ సీహెచ్‌ శంకరరావు బుధవారం తెలిపారు. గత సోమవారం బోడసింగిపేట వద్ద జాతీయ రహదారిపై నడిచి వెళ్తున్న మీసాల సీతమ్మ (73)ను బొలేరో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీతమ్మ విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు  మీసాల సత్యం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి.సాయికృష్ణ కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-10-01T11:25:48+05:30 IST