అమరావతి రైతుల అరెస్టు అన్యాయం
ABN , First Publish Date - 2020-10-31T10:43:35+05:30 IST
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి
పాడేరురూరల్, అక్టోబరు 30: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అమరావతి రైతుల అరెస్టుకు నిరసనగా శుక్రవారం ఆమె టీడీపీ శ్రేణులతో కలిసి అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి రైతుల కోర్కె తీరేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాటాలను కొనసాగిస్తాదన్నారు. రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలుపర్తి గోవిందరావు, గబ్బాడ శాంతికుమారి, కూడి రామునాయుడు, వర్తన నీలకంఠం, చీకటి మధు, గంగపూజారి శివకుమార్, జ్యోతికిరణ్, కె.రాధాకృష్ణ పాల్గొన్నారు.