అద్దె బస్సు డ్రైవర్లకు జీతాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2020-09-28T10:40:17+05:30 IST
ప్రజారవాణా శాఖ (పీటీడీ)లో అద్దె బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించి, జీతాలు చెల్లించాలని వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్ డిమాండ్ చేశారు.
మద్దిపాలెం : ప్రజారవాణా శాఖ (పీటీడీ)లో అద్దె బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించి, జీతాలు చెల్లించాలని వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్ డిమాండ్ చేశారు.
లాక్డౌన్ కాలంలో డ్రైవర్ల జీతాలు చెల్లించకపోవడాన్ని నిరిసిస్తూ ఆదివారం పిఠాపురం కాలనీలోని సీఐటీయూ కార్యాలయం నుంచి మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అర్ధనగ్నంగా ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేసిన తర్వాత ఏ ఒక్కరినీ తొలగించనని చెప్పిన ప్రభుత్వం ఇలా చేయడం తగదన్నారు. అక్టోబర్ 2లోగా జీతాలు చెల్లించకుంటే ఆందోళకు దిగుతామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు కృష్ణారావు, అద్దెబస్సు కార్మిక సంఘం నాయకులు అప్పడు, తులసీరాం, శివ పాల్గొన్నారు.