షిప్యార్డును సందర్శించిన ఈఎన్సీ చీఫ్
ABN , First Publish Date - 2021-04-11T06:22:11+05:30 IST
తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ హిందుస్థాన్ షిప్యార్డును శనివారం సందర్శించారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ హిందుస్థాన్ షిప్యార్డును శనివారం సందర్శించారు. నేవీకి సంబంధించిన ప్రాజెక్ట్ పనుల గురించి సీఎండీని అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి అన్నింటిని అందజేయాలని ఏబీ సింగ్ సూచించారు.