మరో 34 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-01-27T06:11:38+05:30 IST
జిల్లాలో మంగళవారం మరో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో 60,196కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య
విశాఖపట్నం, జనవరి 26(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం మరో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 60,196కు చేరింది. వీరిలో 59,532 మంది వైరస్ నుంచి కోలుకోగా, మరో 131 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్ బారినపడి 533 మంది మృత్యువాత చెందారు.