రేపు ఒంగోలులో వీఆర్ఏల పాదయాత్ర
ABN , First Publish Date - 2022-08-10T05:20:41+05:30 IST
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11వతేదీ ఉదయం 10గంటలకు స్థానిక సీఐటీయూ కార్యాలయం నుం చి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వీఆర్ఏల సంఘం ప్రధానకార్యదర్శి పి.వివేకానంద, గౌరవాధ్యక్షుడు జి.శ్రీనివాసులు తెలిపారు.
ఒంగోలు(కలెక్టరేట్), ఆగస్టు 9: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11వతేదీ ఉదయం 10గంటలకు స్థానిక సీఐటీయూ కార్యాలయం నుం చి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వీఆర్ఏల సంఘం ప్రధానకార్యదర్శి పి.వివేకానంద, గౌరవాధ్యక్షుడు జి.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో ఈమేరకు పోస్టర్లను ఆవిష్కరించారు. సీఎం జగన్మోహన్రెడ్డి వీఆర్ ఏల సమస్యలను పరిష్కరిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారని, మూడేళ్ళు గడుస్తు న్నా పట్టించుకోలదేని విమర్శించారు. ఈనేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారం కో సం చేపట్టిన పాదయాత్రలో వీఆర్ఏలు అందరూ పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు వేణు తదితరులు పాల్గొన్నారు.