వీఎంఆర్డీఏ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అక్కరమాని విజయనిర్మల

ABN , First Publish Date - 2021-08-20T05:54:26+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభీష్టం మేరకు విశాఖ నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని వీఎంఆర్డీఏ నూతన చైర్‌పర్సన్‌గా నియమితులైన అక్కరమాని విజయనిర్మల పేర్కొన్నారు.

వీఎంఆర్డీఏ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అక్కరమాని విజయనిర్మల

నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి

వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల


సిరిపురం, ఆగస్టు 19: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభీష్టం మేరకు విశాఖ నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని వీఎంఆర్డీఏ నూతన చైర్‌పర్సన్‌గా నియమితులైన అక్కరమాని విజయనిర్మల పేర్కొన్నారు. గురువారం సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మక సంస్థ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, బాబూరావు, అదీప్‌రాజు, గణేష్‌కుమార్‌, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, మళ్ల విజయప్రససాద్‌, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయనిర్మల వీఎంఆర్డీఏ భవన్‌లో చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వీఎంఆర్డీఏ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు.

Updated Date - 2021-08-20T05:54:26+05:30 IST