vizianagaram: సింహాచలం భూముల వ్యవహారంపై ఊర్మిళ గజపతి స్పందన

ABN , First Publish Date - 2021-07-17T14:20:11+05:30 IST

మాన్సస్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి దివంగత ఆనంద గజపతిరాజు జన్మదినం సందర్భంగా ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు సుధా, ఊర్మిళ గజపతి నివాళులర్పించారు.

vizianagaram: సింహాచలం భూముల వ్యవహారంపై ఊర్మిళ గజపతి స్పందన

విజయనగరం: మాన్సస్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి దివంగత ఆనంద గజపతిరాజు జన్మదినం సందర్భంగా ఆయన సమాధి వద్ద  కుటుంబ సభ్యులు సుధా, ఊర్మిళ గజపతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింహాచలం భూముల వ్యవహారంపై ఊర్మిల స్పందించారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియదన్నారు. తాను కూడా అందరిలానే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని తెలిపారు. మాన్సస్ ట్రస్ట్ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని... ఈ వ్యవహారం ముగింపు కోసం అందరి మాదిరిగానే తానూ ఎదురుచూస్తున్నానని చెప్పారు. మాన్సస్ సంస్థలో తన తండ్రి చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆడిట్ జరిగినట్లు సమాచారం ఉందని,  ఆయన తర్వాత ఎం జరిగిందో తెలియదని ఊర్మిళ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-17T14:20:11+05:30 IST