ముగిసిన వెంకయ్య పర్యటన

ABN , First Publish Date - 2022-02-26T15:13:50+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చెన్నై పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 13వ తేదీన చెన్నై వచ్చిన వెంకయ్య.. నగరంలోని ఓ హోటల్లో జరిగిన తన మనవరాలి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

ముగిసిన వెంకయ్య పర్యటన

                     - విమానాశ్రయంలో గవర్నర్‌ సాదర వీడ్కోలు


చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చెన్నై పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 13వ తేదీన చెన్నై వచ్చిన వెంకయ్య.. నగరంలోని ఓ హోటల్లో జరిగిన తన మనవరాలి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అనంతరం రాజ్‌భవన్‌ నుంచి ప్రత్యక్ష, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 13 రోజుల పర్యటన ముగించుకున్న వెంకయ్య దంపతులు.. శుక్రవారం ప్రత్యేక విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. ఆయనకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Updated Date - 2022-02-26T15:13:50+05:30 IST