AP: స్కూటీని ఢీకొన్న లారీ...యువతి మృతి
ABN , First Publish Date - 2022-03-17T15:14:24+05:30 IST
నగరంలోని సత్యం జంక్షన్లో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది.
విశాఖపట్నం: నగరంలోని సత్యం జంక్షన్లో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. స్కూటీని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతికి తీవ్ర గాయాలు అవడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.