250వ రోజుకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షలు
ABN , First Publish Date - 2021-10-19T14:50:11+05:30 IST
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు 250వ రోజుకు చేరుకున్నాయి.
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు 250వ రోజుకు చేరుకున్నాయి. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట 250 మంది కార్యకర్తలతో దీక్ష ప్రారంభమైంది. దీక్షలకు బీజేపీ మినహా రాజకీయ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ఏయూ మాజీ వైస్ ఛాన్స్లర్, సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్స్లర్ జిఎస్ఎన్ రాజు, స్టీల్ ప్లాంట్ మాజీ ఆపరేషనల్ డైరెక్టర్ కేకే రావు, సీపీఎం నర్సింగరావు, సీపీఐ నాని దీక్షలో పాల్గొన్నారు.