ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో వంటా వార్పు..

ABN , First Publish Date - 2021-11-26T15:47:40+05:30 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు.

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో వంటా వార్పు..

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కుపరిరక్షణ పోరాటకమిటీ ఆద్వర్యంలో శుక్రవారం ఉద్యోగులు, కార్మికులు వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ఆర్చ్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరం వరకు వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు విధానం రద్దుతో పాటు, కార్మిక లేబర్ కోడ్‌ల రద్దుతో పాటు ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-26T15:47:40+05:30 IST