మహానందిలో ప్రముఖులు
ABN , First Publish Date - 2020-12-06T05:13:12+05:30 IST
మహానంది శైవ క్షేత్రాన్ని శనివారం ప్రముఖులు సందర్శించారు.
మహానంది, డిసెంబరు 5: మహానంది శైవ క్షేత్రాన్ని శనివారం ప్రముఖులు సందర్శించారు. గుంతకల్లు డివిజన్ రైల్వే డీఆర్ఎం అలోక్ తివారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి వేదపండితులు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. కామేశ్వరీ సహిత మహానందీశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు డీఆర్ఎం దంపతులను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట రైల్వే సిబ్బంది ఉన్నారు.
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు రాఘవరెడ్డి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో ధనుంజయ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవరెడ్డికి ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో సత్కారం నిర్వహించి తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.