ఒంటరిగా మద్యం తాగుతున్న యువకుడికి.. యువతిని ఎరగా చూపి..

ABN , First Publish Date - 2020-08-07T11:28:28+05:30 IST

రోడ్డు వెంట ఒంటరిగా మద్యం తాగుతున్న యువకుడికి, యువతిని ఎరగా చూపి..

ఒంటరిగా మద్యం తాగుతున్న యువకుడికి.. యువతిని ఎరగా చూపి..

ఒంగోలు(ప్రకాశం): రోడ్డు వెంట ఒంటరిగా మద్యం తాగుతున్న యువకుడికి, యువతిని ఎరగా చూపి దోపిడీచేసిన ఘటన ఒంగోలులో బుధవారం రాత్రి జరిగింది. అందిన సమాచారం మేరకు... స్థానిక టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురు నివాసం ఉండే ఓ యువకుడు బుధవారంరాత్రి 7-30 గంటల సమయంలో కొప్పోలు వెళ్లే ఫ్లైఓవర్‌ పక్కన సర్వీసురోడ్డులో మద్యం తాగుతున్నాడు. అటువైపుగా ఆటోలో వచ్చిన ఓ యువతి, ఆమెకు తోడుగా వచ్చిన కుర్రాడు మద్యం తాగుతున్న వ్యక్తిని మాటల్లోకి దించి ఆకర్షించారు. అనంతరం అదే ఆటోలో ఆ యువకుడు ఎక్కడంతో అగ్రహారం గేటు వైపు చిల్లచెట్లలోకి తీసుకెళ్లి అతడి వద్ద ఉన్న నగదు, ఏటీఎం కార్డులు, బైకు తాళాలను అపహరించారు.


బాధితుడు సహాయం కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లిన క్రమంలో తిరిగి సంఘటనా స్థలానికి వచ్చే సరికి బైకు కూడా చోరీకి గురవడంతో బోరుమన్నాడు. దీంతో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే ప్రాంతంతో పాటు నగర శివారుల్లో రాత్రి వేళల్లో ఇలాంటి తరహా నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు ఇటీవల కాలంలో పెరిగాయి. పోలీసుల నిఘా కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-08-07T11:28:28+05:30 IST