లాక్‌డౌన్‌ నిబంధన అతిక్రమణ

ABN , First Publish Date - 2020-03-31T11:42:36+05:30 IST

తాడిపత్రి సబ్‌డివిజన్‌ పరిధిలోని తొమ్మిది స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 170 మంది నిందితులపై 145

లాక్‌డౌన్‌ నిబంధన అతిక్రమణ

170 మందిపై కేసుల నమోదు


తాడిపత్రి, మార్చి 30: తాడిపత్రి సబ్‌డివిజన్‌ పరిధిలోని తొమ్మిది స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 170 మంది నిందితులపై 145 కేసులు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 80 షాపులు, 34 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. 1153 ద్విచక్రవాహనాలపై రూ.4,57,525 జరిమానా వి ధించామన్నారు. లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలు చేయడాని కి ప్రజలు సహకరించాలని కోరారు. బయటకు వస్తే కఠిన చ ర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-03-31T11:42:36+05:30 IST