25న సప్తగిరి వైభవం
ABN , First Publish Date - 2020-02-20T10:03:59+05:30 IST
ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో ఈ నెల 25న రవీంద్రభారతిలో అమెరికా నుంచి విచ్చేసిన ప్రఖ్యాత నర్తకీమణి కళారత్న వింజమూరి సుజాత బృందం పస్తగిరి వైభవం నృత్య రూపకం ప్రదర్శించనుంది.
పంజాగుట్ట, ఫిబ్రవరి19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో ఈ నెల 25న రవీంద్రభారతిలో అమెరికా నుంచి విచ్చేసిన ప్రఖ్యాత నర్తకీమణి కళారత్న వింజమూరి సుజాత బృందం పస్తగిరి వైభవం నృత్య రూపకం ప్రదర్శించనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమ బ్రోచర్ను బుధవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వింజమూరి మాట్లాడుతూ ఈ నృత్య ప్రదర్శనకు గవర్నర్తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి, కేవీ రమణాచారి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, నన్నపనేని రాజకుమారి తదితరులు హాజరవుతారని తెలిపారు. బ్రోచర్ ఆవిష్కరణలో రాగ సప్తస్వరం కార్యదర్శి కె.అహల్య, సమన్వయకర్త వీఎస్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.