జగన్ ది ఐరన్ లెగ్
ABN , First Publish Date - 2020-11-30T04:43:33+05:30 IST
రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్రెడ్డి ఐరన్ లెగ్ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపాతి పార్లమెంటు టీడీపీ ఇన్చార్జి నరసింహులు యాదవ్ విమర్శించారు.
ఆయన సీఎం అయ్యాకే ప్రజలకు కష్టాలు
వరద సహాయక చర్యలు ఎక్కడ ?
హెలికాప్టర్లో తిరిగితే ప్రజల కష్టాలు కనిపించవు
మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల, నరసింహులు యాదవ్ ధ్వజం
వెంకటగిరి, నవంబరు 29 : రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్రెడ్డి ఐరన్ లెగ్ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపాతి పార్లమెంటు టీడీపీ ఇన్చార్జి నరసింహులు యాదవ్ విమర్శించారు. ఆదివారం నియోజకవర్గంలో తుఫానుతో దెబ్బతిన్న మగ్గాలు, వరిపైర్లను పరిశీలించారు. అనంతరం స్థానిక తెలుగుగంగ అతిఽథిగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ తుఫానుతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. చేనేతలకు ఎన్నడూలేనంతగా నష్టం వాటిల్లిందన్నారు. తుఫాను బాధితులకు సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విశాఖలో హుద్హుద్ తుఫాను సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించిన తీరునుగుర్తుచేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో కరోనాతో కొంతమంది చనిపోగా, తుపానుల కారణంగా ఎంతో మంది నష్టపోయారన్నారు. దీంతో ఆయన ఐరన్లెగ్ ముఖ్య మంత్రిగా చరిత్రలో నిలిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు ఉష, నియోజకవర్గ పరిశీలకుడు జన్ని రమణయ్య, నాయకులు రవి నాయుడు, బీరం రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్, శ్రీరాం దాసు గంగాధర్, పునుగోటి విశ్వనాఽథం నాయుడు, ఆనంద్, చలపతి, సుధాకర్, నరసింహులు, ఆవుల ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.