గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-07-31T06:15:19+05:30 IST

గ్రామస్వరాజ్యమే ధ్యేయంగా సర్పం చలు పనిచేసి పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని జడ్పీ సీఈఓ భా స్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా పనిచేయాలి

సర్పంచల శిక్షణ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ

 ధర్మవరంరూరల్‌, జూలై30: గ్రామస్వరాజ్యమే ధ్యేయంగా సర్పం చలు పనిచేసి పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని జడ్పీ సీఈఓ భా స్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కస్తూర్భి గాంధీ పాఠశాలలో కొ త్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి, మండలాల సర్పంచలకు రెండవరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి జడ్పీసీఈఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యమే ధ్యేయంగా పనిచేయాలని సర్పంచలకు సూచించారు. గ్రామాభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు మంజూరు అవుతాయని వాటిని అభివృద్ధి పనులకు మాత్రమే ఖర్చుపెట్టాలన్నారు. సంక్షేమపథకాలు ప్రజలందరికి అందేలా చొరవ చూపాలన్నారు. అనంతరం శిక్షకులు సర్పంచలు విధులు, ప్రజలకు అందించే ప్రభుత్వ పథకాలు, సచివాలయా ల్లో సర్పంచల పాత్రపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీధర్‌, ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డి, శిక్షకులు నసీమా, కామాక్షి, రామాంజినేయులు, ఓబిరెడ్డి, మనో హర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T06:15:19+05:30 IST