వికారాబాద్ జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం

ABN , First Publish Date - 2021-07-25T20:02:00+05:30 IST

వికారాబాద్ జిల్లా: పెద్దేముల్ మండల కేంద్రంలో నాటుబాంబు కలకలం రేపింది.

వికారాబాద్ జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం

వికారాబాద్ జిల్లా: పెద్దేముల్ మండల కేంద్రంలో నాటుబాంబు పేలుడు కలకలం రేపింది. ఎస్సీ కాలనీలోని యాదప్ప అనే వ్యక్తి ఇంట్లో నాటుబాంబు  పేలింది. ఈ ఘటనలో ఆయన కుమారుడు వెంకట్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకట్ పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. స్థానికంగా ఈ ఘటన భయాందోళనలు రేపింది. ఇంట్లో ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో చుట్టూ ఉన్నవాళ్లంతా హడలిపోయారు. తాండూరు డీఎస్సీతోపాటు పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. పేలుడు కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-07-25T20:02:00+05:30 IST