‘ఉద్యోగులతో సంబంధం లేని సజ్జల ఎందుకు మాట్లాడారు?’

ABN , First Publish Date - 2022-02-03T17:04:52+05:30 IST

పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి...

‘ఉద్యోగులతో సంబంధం లేని సజ్జల ఎందుకు మాట్లాడారు?’

విజయవాడ: పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు తరలి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేయడంతో ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ఉద్యోగులతో సంబంధంలేని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడమేంటని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు వారి విలువలు కాపాడుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించాలన్నారు. ప్రజల సంక్షేమమే ముఖ్యమన్న సీఎం జగన్.. ఉద్యోగుల గురించి కొంచెం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సజ్జల ముఖ్యమంత్రిని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని, తమ హక్కులను కాపాడాలని ఉద్యోగులు సీఎం జగన్‌కు మరోసారి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-02-03T17:04:52+05:30 IST