‘సీఎం Jagan దావోస్‌లో చలి కాచుకుంటూ.. కోనసీమలో అగ్గి రాజేశారు’

ABN , First Publish Date - 2022-05-29T20:29:34+05:30 IST

సీఎం జగన్ దావోస్‌లో చలి కాచుకుంటు...కోనసీమలో అగ్గి రాజేశారని పెదపూడి విజయ్ కుమార్ ఆరోపించారు.

‘సీఎం Jagan దావోస్‌లో చలి కాచుకుంటూ.. కోనసీమలో అగ్గి రాజేశారు’

Vijayawada: ముఖ్యమంత్రి జగన్ (Jagan) దావోస్‌లో చలి కాచుకుంటు...కోనసీమలో అగ్గి రాజేశారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోనసీమ ఘటన వైసీపీ పొద్బలంతోనే జరిగిందని, అరాచకాలు, దుర్మార్గాలు జగన్ పాలనలో నడుస్తున్నాయని ఆరోపించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి Dr. గౌతమ్ మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ లబ్ది కోసం అంబేద్కర్ పేరును వాడుకోలేదని... ఈ ఘనత వైసీపీకే చెందుతుందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చాలా జరిగే అవకాశం వుందని అన్ని వర్గాలు జాగ్రత పడాలని డా. గౌతమ్ సూచించారు.

Updated Date - 2022-05-29T20:29:34+05:30 IST