హెడ్మాస్టర్కు కరోనా... భయాందోళనలో విద్యార్థులు
ABN , First Publish Date - 2021-04-22T17:35:05+05:30 IST
నగరంలోని పాయకపురం సుందరయ్యనగర్ శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
విజయవాడ: నగరంలోని పాయకపురం సుందరయ్యనగర్ శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. స్కూల్లో 162 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో హెడ్మాస్టర్కు కరోనాతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలకు సోమవారం వరకు విద్యశాఖ అధికారులు సెలవు ప్రకటించారు.