Vijayanagaram: మైథాన్ కంపెనీ వద్ద కార్మికుల ఆందోళన
ABN , First Publish Date - 2022-03-10T16:25:50+05:30 IST
బొబ్బిలి పారిశ్రామిక వాడలో గల మైథాన్ కంపెనీ గేటు వద్ద కార్మికులు బైఠాయించి ఆందోళనకు దిగారు.
విజయనగరం: బొబ్బిలి పారిశ్రామిక వాడలో గల మైథాన్ కంపెనీ గేటు వద్ద కార్మికులు బైఠాయించి ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలో జేసీఎల్ వద్ద జరిగిన చర్చల ప్రకారం 75 జీఓ అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. కంపెనీలోకి వెళ్లాలనుకొనే మహిళలపై పోలీసులు చేయిచేసుకున్నారు. కార్మికులతో బాహాబాహీకి దిగిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి.