విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-01T05:01:22+05:30 IST

విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు
నూతన విగ్రహాలకు ధాన్యాదివాసం నిర్వహిస్తున్న భక్తులు

చౌదరిగూడ: మండల పరిధిలోని లాల్‌పహాడ్‌ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మూడో రోజు సోమవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ధాన్యాదివాసం, హోమం, క్షీరాభిషేక పూజలు నిర్వహించారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ లక్ష రూపాయలను ఆలయ నిర్మాణానికి అందించినట్లు ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ మచ్చా సుధాకర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కవిత, జడ్పీటీసీ స్వరూప, ట్రస్ట్‌ సభ్యులు సంకోజు లక్ష్మీనారాయణ, ఆకారపు నాగరాజు, పడకంటి వెంకటేష్‌, గోపాల్‌రెడ్డి, గున్నాల శేఖర్‌, చందూ, మాధవరెడ్డి, బోయ రాంచంద్రయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:01:22+05:30 IST