విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2021-04-13T05:23:01+05:30 IST
నంద్యాలలోని బార్ అండ్ రెస్టారెంట్లు, బ్రేకరీలు, చికెన్ షాపులపై జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడులు చేశారు.
నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్ 12: నంద్యాలలోని బార్ అండ్ రెస్టారెంట్లు, బ్రేకరీలు, చికెన్ షాపులపై జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడులు చేశారు. విజిలెన్స్ డీఎస్పీ సుధాకర్రెడ్డి నేతృత్వంలోని బృందం దాడుల్లో పాల్గొన్నది. పట్టణంలోని శక్తి, జూబ్లీ, భారత్, అప్సర బార్ అండ్ రెస్టారెంట్లపై, మోడరన్ బ్రేకరీ, కృష్ణ మనోహర్ చికెన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. పుడ్ సేప్టీ, శానిటరీ నిర్వహణ నియమావళి సరిగ్గా లేని వాటికి జరిమానా విధించారు. అప్సర బార్ అండ్ రెస్టారెంట్పై రూ.25 వేలు, భారత్ బార్ అండ్ రెస్టారెంట్పై రూ.25 వేలు, శక్తి బార్ అండ్ రెస్టారెంట్పై రూ.20వేలుతోపాటు ఇతర షాపులపై రూ.5 వేలు జరిమానా విధించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ నాగరాజుయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.