విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN , First Publish Date - 2022-08-08T06:21:00+05:30 IST

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

చిట్టినగర్‌, ఆగస్టు 7: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. జిల్లా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థి కె.సాయి హాసినీని  ఆదివారం తన నివాసంలో  మేయర్‌  అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా విద్యను అభ్యసించడంతోపాటు క్రీడల్లో రాణించడం వలన భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునన్నారు. స్కూల్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.రావు  మాట్లాడుతూ కె.సాయి హాసిని అండర్‌-15లో ప్రథమ, అండర్‌-17లో తృతీయ స్థానం సాధించిందన్నారు. కోచ్‌ కె.భాస్కర్‌, వైసీపీ నాయకులు రాయన నరేంద్రకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T06:21:00+05:30 IST