వీహెచ్కు వెంకయ్యనాయుడు ఫోన్
ABN , First Publish Date - 2021-07-12T16:53:09+05:30 IST
మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వీ హనుమంతరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్లో పరామర్శించారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వీ హనుమంతరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్లో పరామర్శించారు. కిడ్నీ సమస్యతో వీహెచ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీహెచ్కు ఫోన్ చేసిన వెంకయ్య ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. ఆరోగ్యం కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని వెంకయ్య అన్నారు. కాగా... తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు. తమ పరామర్శతో తనకు చాలా ఉత్సాహం వచ్చిందని వీహెచ్ చెప్పారు.