కరోనాతో సీపీఎం నేత మృతి

ABN , First Publish Date - 2020-08-06T22:30:28+05:30 IST

కరోనాతో సీపీఎం నేత మృతి

కరోనాతో సీపీఎం నేత మృతి

కోల్ కతా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ బెంగాల్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సీపీఐ (ఎం) నేత శ్యామల్ చక్రవర్తి కోవిడ్-19తో మరణించారు. సీపీఐ (ఎం) సీనియర్ నాయకుడు శ్యామల్ చక్రవర్తి కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ -19తో గురువారం మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చక్రవర్తి వయసు 76 సంత్సరాలు ఉంటుంది. 1982 నుంచి 1996 వరకు పశ్చిమ బెంగాల్ లో మూడుసార్లు రవాణా మంత్రిగా పని చేశారు. చక్రవర్తికి జూలై 30న కోవిడ్-19 పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. అతను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రముఖ ట్రేడ్ యూనియన్ వాది కూడా, కరోనాతో అతను ఈ మధ్యాహ్నం మరణించారు. అతను గత కొన్ని రోజులుగా వెంటిలేషన్‌లో ఉన్నారని పార్టీ నాయకుడు చెప్పారు. ఆయనకు కుమార్తె ఉషాసి ఉన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19తో మరణించిన చక్రవర్తి, రెండవ ప్రముఖ రాజకీయ నాయకుడు. జూన్ లో కరోనాతో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ మరణించారు. బుధవారం రోజు బిధన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ సుభాష్ బోస్ కూడా కోవిడ్-19తో మరణించారు.

Updated Date - 2020-08-06T22:30:28+05:30 IST