పట్టాలెక్కిన తొలి కిసాన్ రైలు
ABN , First Publish Date - 2020-08-08T07:19:41+05:30 IST
దేశంలోని తొలి ‘కిసాన్ రైలు’ పట్టాలెక్కింది. నాసిక్లోని డియోలాలి నుంచి బిహార్లోని దనాపూర్కు వెళ్లే తొలి రైలును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం ప్రారంభించారు...
ముంబై, ఆగస్టు 7: దేశంలోని తొలి ‘కిసాన్ రైలు’ పట్టాలెక్కింది. నాసిక్లోని డియోలాలి నుంచి బిహార్లోని దనాపూర్కు వెళ్లే తొలి రైలును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవా రం ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తులను.. ముఖ్యంగా త్వరగా పాడైపోయే వాటిని తక్కువ ధరకు రవాణా చేయడమే కిసాన్ రైలు ప్రధాన ఉద్దేశమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం దీనిని వారానికోసారి నడుపుతారు.