వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-05-26T04:29:05+05:30 IST
వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం
శామీర్పేట, మే25 : మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలోని అక్కన్న-మాదన్న ఆలయంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని బుధవారం ఆలయ కమిటీ చైర్మన్ నల్లబుచ్చిరెడ్డి అధ్వర్యంలో కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, అభిషేకం, అలంకరణ, గరుఢ సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణ మధ్య వేంకటేశ్వరుడి కల్యాణోత్సవాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ శరత్చంద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ హరివర్దన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, సర్పంచ్ యాంజాల్ అనురాధ, ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.